తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా వంశీ బయటపెట్టారు. ‘విజయ్తో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. విభిన్నమైన కథ భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా లాక్డౌన్ పూర్తైన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తాం’ అని వంశీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు విజయ్కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తి అయిన వెంటనే ఆయన వంశీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.