HomeTelugu Trendingసాయితేజ్ చాలా మంచి వ్యక్తి: విజయశాంతి

సాయితేజ్ చాలా మంచి వ్యక్తి: విజయశాంతి

Vijayashanthi tweet on sai

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి కూడా వెళ్లారు.

తాజాగా సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాయి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. సాయితేజ్ చాలా మంచి వ్యక్తి అని కితాబునిచ్చారు. మంచి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవభావం కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. మంచి టాలెంట్ ఉన్న నటుడని అన్నారు. సాయితేజ్ త్వరగా కోలుకుని, ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu