కిరణ్ అబ్బవరం వరుస ఫ్లాప్లతో ఉన్నాడు. ఈ టైమ్లో ఇటీవలే విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఆయనకు కొంచెం ఊరట లభించింది అనే చెప్పాలి. రిలీజ్కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్ధ గీతా నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనే అంచనాలు నెలకొన్నాయి.
రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కలక్షన్లలో పర్వలేదు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టేపనిలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ‘ఓటీటీ’ విడుదలకు సిద్ధమౌతున్నట్లు టాక్.
ఈ సినిమా హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. కాగా మార్చి 25నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. నెట్ఫ్లిక్స్తో పాటు ఆహాలోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కశ్మీర పరదేశి హీరోయిన్గా నటించింది. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిచాడు.
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు