HomeTelugu Trendingసైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిలు ఎవరో తెలుసా!

సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిలు ఎవరో తెలుసా!

5 4మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. అయితే, ఈ నెల 15 వ తేదీ నుంచి సినిమాను ప్రమోషన్స్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతున్నది. సెప్టెంబర్ 15 వ తేదీన కర్నూలు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. సైరా నారసింహారెడ్డి పుట్టిన జిల్లా కావడంతో అక్కడ ఈ వేడుకను నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ వేడుకను నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారట.

అయితే, ఈవెంట్ కు మెగా హీరోలతో పాటు స్పెషల్ గెస్ట్స్ కూడా హాజరు కాబోతున్నారు. అందులో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ కూడా ఉన్నారని తెలుస్తోంది. అమితాబ్ ఈ సినిమాలో ఓ కీ పాత్ర చేస్తున్నారు. అలానే మెగాస్టార్ కు రజినీకాంత్ మంచి స్నేహితుడు కూడా. ఇద్దరు కలిసి అనేక సినిమాలు చేశారు. ఈ వేడుకలోనే ఆడియో, ట్రైలర్ ను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu