HomeTelugu Trendingతనపై జరిగిన దాడిపట్ల వైఎస్ జగన్ స్పందన

తనపై జరిగిన దాడిపట్ల వైఎస్ జగన్ స్పందన

తనపై జరిగిన దాడిపట్ల ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు ట్విట్టర్‌ ద్వారా వైఎస్ జగన్ తెలిపారు. భగవంతుని దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పిరికిపందల చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న పోరాటాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలన్న తన సంకల్పం మరింత బలపడుతుందని జగన్ స్పష్టం చేశారు.

7 15

విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేశాడు. ఈ ఘటనపై వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. ఆయనకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరగడంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాడి వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu