HomeTelugu Newsపృథ్వీ వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌..

పృథ్వీ వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌..

6 9
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి…ఇక, ఈ వ్యవహారంపై పృథ్వీని టార్గెట్ చేస్తూ పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇవ్వడంతో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో నిన్న తాజాగా మరో వీడియోను విడుదల చేశారు ఎస్వీబీసీ చైర్మన్. అమరావతి ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారంటూ మరోసారి సంచలన కామెంట్లు చేసిన ఆయన పెయిడ్ ఆర్టిస్టుల సంస్కృతి తెచ్చిందే టీడీపీ అని ఆరోపించారు. దీనిపై ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కోన్నారు. అయితే వైసీపీలో పృథ్విరాజ్‌ ఎపిసోడ్‌ ఇప్పుడు కాక రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా ఉందని అంటున్నారు. రైతుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని తీవ్రగా పరిగణిస్తున్న అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని సమాచారం. కులాలను ప్రస్తావిస్తూ ఎవరూ ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడకూడదంటూ ఇప్పటికే అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu