HomeTelugu Newsఅరుదైన గౌరవం దక్కించుకున్న' వైఫ్‌ ఆఫ్‌ రామ్‌'

అరుదైన గౌరవం దక్కించుకున్న’ వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో విజయ్‌ యెలకంటి దర్శకత్వంలో రూపొందించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్మెంట్‌ సయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్‌ అవక ముందే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. కెనడాలో జరగబోయే ఒట్టావా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అఫీషియల్‌ స్క్రీనింగ్‌కు ఈ చిత్రం ఎంపికైంది.

2 1

జూన్‌ 13 నుంచి జరగబోయే ఈ ఫెస్టివల్‌కు 2 డాక్యుమెంటరీలు, 9 ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంపికయ్యాయి. ఇందులో వైఫ్ ఆఫ్‌ రామ్‌ రిలీజ్‌ కాక ముందే సోషియల్లీ కాన్షియస్‌ థ్రిల్లర్‌ గా చోటు సంపాదించుకోవటం విశేషం. భర్తను చంపిన వాళ్లను ఛేదించే క్రమంలో ఓ యువతి ఎదుర్కొన్న వింత పరిస్థితులేంటి అన్నదే ఈ చిత్రకథ. సామ్రాట్‌ రెడ్డి, ఆదర్శ్‌ బాలకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి రఘు దీక్షిత్‌ సంగీతం సమకూరుస్తున్నారు. కెమెరా: సామల భార్గవ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!