సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మహేష్ బాబుకు 25వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ సినిమాకు రిషి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ సూడియోలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్కు మహేష్ పాటు తన గారాలపట్టి సితార కూడా వచ్చింది. ఎందుకో తెలుసా?
కమెడియన్ వెన్నెల కిషోర్తో ఫొటో దిగేందుకు అవును ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు తెలియజేశాడు. ‘తనకెంతో ఇష్టమైన వెన్నెల కిషోర్తో సితార. ఈ ఫోటో కోసమే సితార నాతో పాటు సినిమా సెట్స్కు వచ్చింది’. అని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. వెన్నెల కిషోర్తో పాటు తాను సితార ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు మహేష్.