యంగ్ హీరో సాయిధరమ్తేజ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ శనివారం విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్తేజ్ నటించిన సినిమా ‘తేజ్ ఐ లవ్ యు’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. గోపీ సుందర్ ఈ చిత్రానికి పాటలు అందించారు ఈ పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం విజయవాడలో ఆడియో సక్సెస్ మీట్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా విజయవాడ విచ్చేసిన చిత్ర బృందం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ నిర్వాహకులు సాయిధరమ్తేజ్, అనుపమ పరమేశ్వరన్లకు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
‘తొలిప్రేమ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ వంటి లవ్ స్టోర్సీని అందించిన కరుణాకరన్ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తేజ్’ మంచి లవ్ ఫీల్తో సాగే ప్రేమకథా చిత్రంగా ‘తేజ్.. ఐ లవ్ యు’ ను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. క్రియేటివ్ కమర్షియల్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు, వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జయ ప్రకాశ్, ప్రవిత్రా లోకేశ్, పృథ్వీ, సురేఖావాణి, వైవా హర్ష, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం జులై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.