HomeTelugu Newsనిఖిల్‌ 'ముద్ర' విడుదలకు ముహుర్తం కుదిరింది.

నిఖిల్‌ ‘ముద్ర’ విడుదలకు ముహుర్తం కుదిరింది.

యువ హీరో నిఖిల్‌ కిరాక్ పార్టీ తరువాత చేస్తున్న చిత్రం ‘ముద్ర’. తమిళంలో హిట్‌ అయిన కణిథన్‌ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాను నవంబర్‌ 8న తేదీన విడుదలచేయాలని నిర్ణయించారు నిర్మాతలు.

3 10

చివరి షెడ్యూల్ షూట్ మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు టిఎన్.సంతోష్ డైరెక్ట్ చేస్తున్నారు. వేణు గోపాల్, రాజకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నిఖిల్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu