HomeTelugu News'నీవెవరో' మూవీ ట్రైలర్‌

‘నీవెవరో’ మూవీ ట్రైలర్‌

ఆది పినిశెట్టి హీరోగా అంధుడి పాత్రను పోషిస్తున్న చిత్రం ‘నీవెవరో’. ఈ చిత్రంలో తాప్సి, రితికా సింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి హరినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు.

11 7

మాస్టర్‌ చెఫ్‌. 15 ఏళ్ల వయసులో చూపు కోల్పోయాడు. కానీ ఆత్మ విశ్వాసం అలానే ఉంది’ అని ఆది పాత్రను పరిచయం చేస్తూ డైలాగ్‌ వినిపించింది. ‘జీవితాంతం నువ్వు నాతో ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది వెన్నెల’ అని ఆది.. తాప్సితో అంటున్నారు. మరోపక్క ‘ఐ లవ్‌ కల్యాణ్‌.. తను చూడలేకపోవచ్చు. కానీ నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది’ అని రితికా అంటున్నారు. మొత్తానికి ఇది ఓ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీలా కనిపిస్తోంది. కారు ప్రమాదంలో ఆది చనిపోయినట్లు చూపించారు. ‘వాళ్ల నాటకాలకు నేను చెక్‌‌ పెడుతాను’ అని ఆది అనడం, ఆయన ఫైట్స్‌ ఆకట్టుకున్నాయి. కోన వెంకట్‌ సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆగస్టు 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!