యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కలయికలో వస్తున్నా చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి సారిగా త్రివిక్రమ్, తారక్లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో బిజినెస్ సర్కిల్స్ తో కూడా చిత్రంపై హైప్ బాగానే ఉంది.
అందుకే చిత్ర శాటిలైట్ హక్కులు రూ. 23 కోట్లకు జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏరియాల వారిగా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తంగా పలుకుతున్నాయి. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం దసరా కానుకగా విడుదలచేయనున్నారు. కాగా ఈ చిత్రంలో తారక్ స్నేహితుడిగా సునీల్ నటిస్తుండటం విశేషం.