HomeTelugu Trendingవినాయక చవితికి విశాల్ 'మార్క్ ఆంటోనీ'

వినాయక చవితికి విశాల్ ‘మార్క్ ఆంటోనీ’

Vishal Mark Antony release
హీరో విశాల్ తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో విశాల్ సరసన రీతూవర్మ హీరోయిన్. ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్.జే. సూర్య, టాలీవుడ్ కమెడియన్, హీరో సునీల్, మరో దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు.

మార్క్ ఆంటోనీ మూవీలో అందరూ సరికొత్త రెట్రో లుక్‌లో కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించనున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ మూవీ టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ సాగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో రూపొందుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu