HomeTelugu News"యాత్ర" చేయబోతున్న అనసూయ

“యాత్ర” చేయబోతున్న అనసూయ

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీ మహా విజయం తర్వాత యువ దర్శకులంతా ఇప్పుడు ఆ వైపుగా దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన సంజయ్‌దత్ బయోపిక్ సంజు కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది.

3 27

టాలీవుడ్‌లో తెరకెక్కబోతున్న మరో బయోపిక్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న “యాత్ర” మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్, శశి నిర్మిస్తున్నారు. కాగా ఈచిత్రంలో ప్రముఖ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో చేయనున్నట్టు సమాచారం. కర్నూలుకు చెందిన రాజకీయ నాయకురాలి పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామ్‌చరణ్ మూవీ రంగస్థలంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని, రావు రమేష్ కూడా ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రంపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu