రాంగోపాల్ వర్మ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘భైరవగీత’. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ హీరోగా నటిస్తున్నాడు . ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమ కోసం భూస్వామ్య వ్యవస్థకు ఎదురుతిరిగే ఒక అనుచరుడి కథగా రూపొందుతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ను త్వరలోనే విడుదలచేయనున్నట్టు వర్మ తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది.