మెగాస్టార్ చిరంజీవి 63వ పుట్టిన రోజు సందర్భంగా నిన్న శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల్లోని మెగాస్టార్ అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ వేడుకల్లో మెగా ఫ్యాన్స్ తో పాటు మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ పాల్గొన్నారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరు వేడుకకు రావడంతో.. శిల్పకళా వేదిక మొత్తం ఆహ్లాదంగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలకు హాజరవుతారని సమాచారం.