HomeTelugu Newsశ్రీకాంత్ హీరోగా ''పెళ్లంటే''

శ్రీకాంత్ హీరోగా ”పెళ్లంటే”

చాలా కాలం తర్వాత శ్రీకాంత్ హీరోగా కుటుంబ కథా చిత్రం ”పెళ్లంటే” తెరకెక్కబోతుంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈచిత్రంలో శాలు చౌరాశియా, మమతా చౌదరి, జెబా అన్సమ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలీ, రాజేంద్రకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో తరుణ్ క్లాప్ ఇవ్వగా, రాజేంద్రకుమార్ స్విచాన్ చేశారు.

6 3
”క్షేమంగా వెళ్లి లాభంగా రండి” సినిమాకు కథ అందించిన రాజేంద్రకుమార్ ఈచిత్రానికి కథను అందిస్తున్నారు. మోయిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ నుంచి బ్యాంకాక్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుందని, సినిమా అంతా సందడిగా సాగిపోతుందని, కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయని, చాలాకాలం తర్వాత హీరో శ్రీకాంత్ ను ఇలాంటి కథలో చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు మోయిన్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu