బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మనవరాలైన సయేషా సైగల్ ‘అఖిల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సయేషాకు హిందీలో కంటే దక్షిణాది సినిమాలతోనే గుర్తింపు వచ్చింది. ఇటీవల విడుదలైన ‘చిన్నబాబు’ చిత్రంలో సయేషా పాత్రకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న సయేషాకు బంపర్ ఆఫర్ వచ్చింది.
అలనాటి నటుడు, తమినాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ యానిమేషన్ పాత్రకు సయేషా సైగల్ జోడిగా నటించే ఆఫర్ వచ్చింది. ‘తమిళంలో కిళక్కు ఆఫ్రికా విల్ రాజు’ అనే సినిమా తెరకెక్కుతోంది. మోషన్ క్యాప్చర్ యానిమేషన్ టెక్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో యానిమేటెడ్ ఎంజీఆర్ పాత్రకు జోడిగా నటించే అవకాసం సయేషా దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్మీడియా ద్వారా వెల్లడించాయి. ఎంజీఆర్ స్నేహితుడు ఇషారి వెలన్ కుమారుడు ఇషారి కె. గణేశ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఎంజీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చిత్రబృందం వెల్లడించింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎంజీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నది కాదని ఆయన అభిమానులు ఎంజాయ్ చేయగలిగేలా ఇందులో బైక్
రేస్లు, ఫైటింగ్ సన్నివేశాలను రూపొందిస్తున్నామని నిర్మాత వెల్లడించారు.