మెగాస్టార్ చిరంజీవిపై అభిమానాన్ని ఎన్. ఈశ్వరయ్య అనే వ్యక్తి ప్రత్యేకంగా చాటుకున్నారు. సైకిల్ యాత్రతో చిరంజీవిని ఇటీవల కలిసి, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కూడా కలిసారు. తిరుపతి నుంచి ఈ యాత్రని ప్రారంభించారాయన. 12 రోజుల్లో హైదరాబాద్ చేరుకున్నారు. తమపై ఇంతటి అభిమానాన్ని చూపించిన ఈశ్వరయ్యతో చిరంజీవి, పవన్ కల్యాణ్ కాసేపు ముచ్చటించారు. ఫొటోని బట్టి చూస్తుంటే పవన్ కల్యాణ్ని ‘భీమ్లా నాయక్’ సెట్లో కలిసినట్టు అనిపిస్తుంది. ఈ సందర్భంగా చిరంజీవి ‘తనను కలిసేందుకు అభిమానికి అంత శక్తి ఎలా వచ్చిందో అంటూ ఆశ్చర్యపోయారు. ఈ సాహసం సరికాదని వారించారు. చాలా సందర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ ఆదరణ గొప్ప ఎనర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మనసు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించినట్టే మేం కూడా వారు వారి కుటుంబ సభ్యులు బావుండాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను’ అని అన్నారు.
ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఆయన ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా నటించినున్నారు. పవన్ కల్యాణ్.. ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ సినిమాల్లో నటిస్తున్నారు.