ప్రముఖ నటుడు ప్రభు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. సోమవారం రాత్రి తీవ్ర కడుపునొప్పి తో ప్రభుని కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలించరంట. ఆయనకి కిడ్ని లో రాళ్లు ఉండగా.. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రభు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారట. ఈ వార్త విన్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శివాజీ గణేష్ వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ప్రభు తన టాలెంట్తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చంద్రముఖి, డార్లింగ్, శక్తి సినిమాల్లో నటించి తెలుగులోనూ గుర్తింపు పొందారు. అలాగే ఆయన ఇటీవలే దళపతి విజయ్ ‘వారసుడు’ చిత్రంలో కనిపించారు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు