HomeTelugu Trending'సీసీసీ'కి తమన్నా విరాళం

‘సీసీసీ’కి తమన్నా విరాళం

2 19
లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద సినీ కార్మికుల కోసం తమ వంతు సాయం అందించేందుకు (సీసీసీ) ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ని మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి విరాళలు ఇచ్చేందుకు స్టార్ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. సీసీసీ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, నితిన్‌, వినాయక్, అనీల్ రావిపూడి తదితరులు తమకి తోచినంత సాయం చేస్తున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్ కూడా సీసీసీ కి 2 లక్షల రూపాయలను అందించింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా.. చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి మూడు లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌ సరసన ‘సీటీమార్‌’ అనే సినిమాలో నటిస్తోంది. నిన్న మొన్నటి వరుకు అసలు స్పందించాని ఈ హీరోయిన్‌లు ఇప్పటికైన విరాళలు ఇవ్వడంతో పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!