HomeTelugu Trendingరెండు సార్లు కరోనా టెస్ట్‌ చేయించుకున్నా: అల్లు శిరీష్‌

రెండు సార్లు కరోనా టెస్ట్‌ చేయించుకున్నా: అల్లు శిరీష్‌

Allu sirish opens about his

మెగా కుటుంబంలో కరోనా టెక్షన్‌ మొదలైంది. ఒక్కకరిగా అందరూ టెస్టులకు క్యూ కడుతున్నారు. ముందుగా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్‌ రాగా.. ఆ తర్వాత వరుణ్ తేజ్‌కు పాజిటివ్ వచ్చింది.. చరణ్ భార్య ఉపాసనకు కూడా దాదాపు కరోనా వచ్చినట్లే. అందుకే రామ్ చరణ్‌తోనే కలిసి క్వారంటైన్‌లో ఉంది ఈమె. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు శిరీష్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఒకటి కాదు రెండు సార్లు తాను టెస్ట్ చేయించుకున్నట్లు చెప్పాడు శిరీష్. రెండుసార్లు నెగిటివ్ వచ్చిందని.. తనకు కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పాడు అల్లు శిరీష్. ఇప్పటికే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఇప్పుడు ఈయన కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. కేవలం శిరీష్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఎక్కడో మాల్దీవ్స్‌లో ఉన్న చైతన్య, నిహారిక జంటను కూడా కరోనా టెక్షన్‌ పెడుతుంది. ఇదిలా ఉంటే కరోనా టెస్ట్ చేయించుకున్నా కూడా తనకు కంగారేం లేదని చెప్తున్నాడు. కరోనా వచ్చాక కంగారు పడేకంటే కూడా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులకు సూచిస్తున్నాడు ఈయన.

మన పనులు మనం చేసుకుంటూనే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనపైనే ఉందని చెప్తున్నాడు అల్లు శిరీష్. మన ప్రపంచంలో మనుషులతో పాటు ఇతర ప్రాణులు కూడా ఉన్నాయని.. వాటితో మనకు వచ్చే రోగాలను నయం చేసేందుకు పురాతన కాలంలోనే ఎన్నో నివారణ మార్గాలు ఉన్నాయని చెప్పాడు. ఆయుర్వేద పద్దతులు ఫాలో అయితే అంతా మంచి జరుగుతుందని చెప్పాడు శిరీష్. ఆ మందులను అప్పుడే మనవాళ్లు కనిపెట్టారని చెప్పాడు ఈయన. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్క్‌లు వాడటమే కాకుండా.. ఆయుర్వేద పద్దతులు కూడా వాడండంటూ అల్లు శిరీష్ అందరినీ కోరాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu