HomeTelugu Newsఓటీటీలోకి 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'.. ఎప్పుడు.. ఎక్కడంటే!

ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’.. ఎప్పుడు.. ఎక్కడంటే!

Ambajipeta Marriage Band OT

టాలీవుడ్‌ నటుడు సుహాస్ ‘కలర్ ఫొటో’, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో హీరోగా మంచి మార్కులే కొట్టేశాడు. ఈ జోష్‌తోనే తాజాగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

శివాని నాగరం హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శరణ్య ప్రదీప్ కీలక పాత్రలో చేసింది. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకుపైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే అది పూర్తి చేసి లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.

తాజాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ విడుదలపై అప్డేట్ వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈక్రమంలో ఆహా ఓ పోస్టర్ విడుదల చేసింది. “మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టండి” అంటూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ తెలిపింది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

అయితే మార్చి 1 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని అంటున్నారు. మొన్నటివరకు మార్చి 8 లేదా 15న రిలీజ్ చేస్తారని టాక్ నడిచింది. కానీ, ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

Recent Articles English

Gallery

Recent Articles Telugu