HomeTelugu Trendingరష్మీకి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరిన శ్రీముఖి..

రష్మీకి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరిన శ్రీముఖి..

9 1
హాట్‌ యాంకర్‌ శ్రీముఖి.. టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించింది. ఈరోజు జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటిన ఆమె.. చెట్లు నాటడం వల్ల ప్రయోజనాలను వివరించింది. వాతావరణ కాలుష్యం వల్ల తన స్నేహితులు చాలా మంది వారి పిల్లలను ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడే స్థిరపడాలని యోచిస్తున్నారని, అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనమంతా కలిసి మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపింది. ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటాలని కోరింది. తన తరఫున యాంకర్ రష్మీ గౌతమ్, బిగ్‌బాస్ వితిక, జానీమాస్టర్‌కు సవాల్ విసురుతున్నానని తెలిపింది. ప్రజలు కూడా తమ వంతుగా మొక్కలు నాటాలని విన్నవించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu