HomeTelugu Trendingగ్రీన్‌ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన మెహ్రీన్‌

గ్రీన్‌ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన మెహ్రీన్‌

Mehreen Kaur Pirzada plante
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్‌ ఫిర్జాదా భాగమయ్యారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ విసిరిన సవాలును ఆమె స్వీకరించారు. ఈ మేరకు ఆమె మూడు మొక్కలు నాటారు. వాటితో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ్‌ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మెహ్రీన్‌కు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu