గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా భాగమయ్యారు. ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన సవాలును ఆమె స్వీకరించారు. ఈ మేరకు ఆమె మూడు మొక్కలు నాటారు. వాటితో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని తన ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మెహ్రీన్కు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.