టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి అనుష్క. నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ తో పాటు తన నటనతోను ప్రేక్షకులను కట్టిపడేసే అనుష్క త్వరలో ‘నిశ్శబ్దం’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక నిశ్శబ్దం సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా చిత్ర దర్శకుడు హేమంత్ తన ట్విట్టర్ ద్వారా లోకేషన్కి సంబంధించిన పిక్ షేర్ చేశాడు. ఇందులో అనుష్క కెమెరాను హ్యాండిల్ చేస్తూ కనిపించింది. సరదాగా అనుష్క కెమెరా పట్టుకుందని దర్శకుడు పేర్కొన్నారు.