స్టార్ హీరోయిన్ అనుష్క కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో నటించనున్నారట. కథ మొత్తం మహిళా ప్రధానంగా నడుస్తుందని టాక్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత గోవింద్ నిహ్లాని రాసిన ఒక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. అంతేకాదు తమిళ బిగ్బాస్ ఫేం అభిరామి వెంకటాచలం కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై చిత్రాన్ని నిర్మించనున్నారట. వచ్చే ఏడాదిలో చిత్రం సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సిందే.
అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్కు విశేషమైన స్పందన లభించింది. ఇందులో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించారు.