HomeTelugu Trendingఅనుష్క 'నిశ్శబ్దం' కూడా ఓటీటీలోనే..

అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఓటీటీలోనే..

Anushka nishshabdam to be

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా.. గత ఐదు నెలల నుంచి థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. కాగా అప్పటికే పూర్తయిన చిత్రాల విడుదలకు పెద్ద ఇబ్బంది ఏర్పడింది. దీంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. అయితే, స్టార్ హీరోల సినిమాలు మాత్రం థియేటర్ల కోసం ఎదురుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన ‘నిశ్శబ్దం’ చిత్రం కూడా ఎప్పుడో పూర్తయి, రిలీజ్‌కు రెడీ అయింది. దీనిని కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నించినా, అనుష్క అభ్యంతరం చెప్పడం వల్ల ఆగిందని ఇన్నాళ్లూ వార్తలొచ్చాయి. ఇక ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపించకపోవడంతో చిత్రాన్ని కూడా ఓటీటీ ద్వారా విడుదల చేసేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ తో అప్పుడే డీల్ కూడా ఓకే
అయ్యిందని అంటున్నారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం. హేమంత్ మధుకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu