‘మా’ అధ్యక్ష పదివికి పోటీ పడుతున్నారు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్. ఎన్నికలు మరో వారం రోజుల్లో (అక్టోబర్ 10)ప జరగనున్న నేపథ్యంలో విష్ణు వరుసగా సీనియర్ హీరోలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. తాజాగా మంచు విష్ణు అగ్రహీరో నందమూరి బాలకృష్ణను కలిశారు. ఈరోజు ఉదయం ‘అఖండ’ చిత్రం సెట్స్ పై బాలయ్యతో భేటీ అయ్యారు. ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తన ప్యానెల్ గెలిస్తే ఏమేం చేస్తామో బాలయ్యకు వివరించారు. అనంతరం మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా వివరాలు తెలిపారు. బాలకృష్ణ మద్దతు తమకేనని ప్రకటించారు.
“థాంక్యూ ఫర్ వన్ అండ్ ఓన్లీ నటసింహం. బాలా అన్నా… ‘మా’ ఎన్నికల వేళ మీ మద్దతుకు, మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. మీ వంటి వారు మా వెన్నంటి ఉండడం గౌరవంగా భావిస్తున్నాను” అంటూ మంచు విష్ణు స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thank you the one and only NataSimham, Bala Anna for you blessings and support for me during these MAA elections. It is my honor to have your backing. ❤️ pic.twitter.com/xvYwBw8ZSz
— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2021