HomeTelugu Trendingత్వరలో రోజాతో బాలకృష్ణ భేటి!

త్వరలో రోజాతో బాలకృష్ణ భేటి!

2 6
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ… తన నియోజకవర్గమైన హిందూపురం అభివృద్ధి కోసం వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా తో భేటీ కానున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ .. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా అక్కడ మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హిందూపురం నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశానని… అయితే తన నియోజకవర్గాన్ని పారిశ్రామికంగానూ అభివృద్ధి చేయాలనే ఆలోచన తనకు ఉందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఏపీఐఐసీ చైర్మన్ రోజాతో మాట్లాడినట్టు బాలకృష్ణ తెలిపారు. ఈ విషయంలో రోజా కూడా సానుకూలంగానే స్పందించారని వ్యాఖ్యానించారు. ”ఏపీఐసీసీ చైర్మన్ రోజా గారితో ఇంతకు ముందే మాట్లాడానని. తప్పకుండా అభివృద్ధి చేద్దాం అని ఆమె చెప్పారు. విజయవాడ వచ్చినప్పుడు తన కార్యాలయానికి రావాలని, అధికారులందరినీ అక్కడికే పిలిపిస్తానని రోజాగారు చెప్పారని. కరోనా తర్వాత ఒకసారి తప్పకుండా వెళ్లి కలుస్తానని బాలయ్య చెప్పారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu