HomeTelugu Trendingమహేష్‌ సినిమాతో బండ్ల గణేష్‌ రీఎంట్రీ

మహేష్‌ సినిమాతో బండ్ల గణేష్‌ రీఎంట్రీ

2 4బండ్ల గణేష్‌ కమెడియన్‌గా, నటుడిగా వెండితెరపై తనదైన ముద్రవేశారు‌. ఆ తర్వాత నిర్మాతగానూ పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అటు నుంచి రాజకీయాలవైపు పయనించిన ఆయన ఇప్పుడు మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో బండ్ల గణేశ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన చిత్ర బృందంతో కలిశారు. ఇందులో బండ్ల గణేశ్‌ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని, ఆ పాత్రకు ఆయన చక్కగా సరిపోతారని చిత్ర బృందం తెలిపింది.

మహేష్‌బాబు ఈ సినిమా లో ఆర్మీ అధికారిగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తికాగా, రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, నరేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దిల్‌రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu