ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. నూతన దర్శకుడు సిద్ధార్థ తెరకెక్కించారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ హీరోగా నటిస్తున్నాడు. ఇర్రా హీరోయిన్. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది. రవి శంకర్ సంగీతం అందించారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా కొత్త ట్రైలర్ను విడుదల చేశారు. ‘ఒక్కసారి కార్చిచ్చు పేట్రేగినాక దానికి పులికి, జింకకు భేదం తెలియదు’ అనే డైలాగ్తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ‘నిన్న నీకు జరిగినాది.. ఈరోజు నాకు.. రేపు ఇంకొకడికి ఇదే జరిగే వరకు ఎదురుచూస్తే మన బతుకులకు అర్థం ఉండదు’ అని హీరో చెబుతున్నారు. కథానాయిక ఇర్రా కత్తి పట్టి.. చివర్లో పవర్ఫుల్గా కనిపించారు. ఫ్యాక్షన్ సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రం నిండిపోయింది.