HomeTelugu Newsబాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

2 2

బాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని గురు నానక్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడుతున్న సరోజ్‌ ఖాన్ గత నెల 17న ఆస్పత్రిలో చేరారు. ఆమెకు కరోనావైరస్ సోకిందనే అనే ఆందోళన కూడా వ్యక్తమైంది. కానీ ఆమెకు కరోనా లేదని నిర్ధారణ అయింది. ఈ తెల్లవారుజామున 1.52 గంటలకు ఆమె గుండెపోటుతో మరణించారు. ఆమె చివరిసారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన కలంక్ తాబ్ హోగయిలో మాధురి దీక్షిత్‌కు కొరియోగ్రఫీ చేశారు. 40 ఏళ్లుగా సరోజ్ ఖాన్ 2 వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. తేజాబ్, దేవదాస్, జబ్ వీ మెట్ సినిమాలకు ఆమెకు జాతీయ అవార్డులు దక్కించుకున్నారు.

2a

Recent Articles English

Gallery

Recent Articles Telugu