HomeTelugu Trendingఆర్జీవీ 'దిశ'కు సెన్సార్ బోర్డు షాక్‌

ఆర్జీవీ ‘దిశ’కు సెన్సార్ బోర్డు షాక్‌

Censor board objection toవివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘దిశ’ ఎన్‌కౌంటర్‌. ఈ సినిమా నుండి ఇప్పటికే ట్రైలర్‌ విడుదలైంది. ఇక త్వరలోనే విడుదల చేద్దామనుకుంటున్నసమయంలో సెన్సార్ బోర్డ్ వర్మకు షాక్‌ ఇచ్చింది. ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. దిశ ఎన్‌కౌంటర్ సినిమాకు అనుమతి ఇవ్వడంపై బోర్డులోని మెజార్టీ సభ్యులు అడ్డు చెప్పారు. సెన్సార్ ఇవ్వాలో లేదో తేల్చుకోలేకపోయినా నలుగురు సభ్యుల బోర్డ్ బృందం మాత్రం అనుమతి నిరాకరించింది. సెన్సార్‌ బృందం అనుమతి నిరాకరణతో సినిమా రివిజన్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. ఈ నేపథ్యంలో 8 సభ్యులు ఉన్న సెన్సార్‌ బోర్డు మళ్లీ సినిమా చూడనుంది. అనంతరం సినిమాపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu