HomeTelugu Newsవైసీపీ వైరస్‌ 'కరోనా'ను మించిపోయింది: చంద్రబాబు

వైసీపీ వైరస్‌ ‘కరోనా’ను మించిపోయింది: చంద్రబాబు

9 7
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను వైసీపీ వైరస్‌ మించిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుడిదారులు పారిపోతున్నారని, కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. ”సింగపూర్‌ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఆసియా పేపర్‌ అండ్‌ పల్ప్‌, రిలయన్స్‌.. అన్నీ ఎనిమిది నెలల్లోనే క్యూ కట్టాయి. ఇది చాలదన్నట్టుగా అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖలో మిలీనియం టవర్‌లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారట. ఒక కంపెనీని తెచ్చే సమర్థత లేదు.. యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగమూ ఇవ్వడం చేతకాదు. అలాంటి వైసీపీకు విశాఖలో లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్న 18 వేల మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా?” అని చంద్రబాబు ప్రశ్నించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu