HomeTelugu Trendingరాజమండ్రికి ప్రయాణమైన చిరూ, కొరటాల టీమ్

రాజమండ్రికి ప్రయాణమైన చిరూ, కొరటాల టీమ్

8 10
మెగాస్టార్‌ చిరంజీవి డైరెక్టర్‌ కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను రాజమండ్రిలో ప్లాన్ చేశారు. చిరంజీవి .. తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రీకరించనున్నారు.

ఈ షెడ్యూల్లో త్రిష కూడా పాల్గొననున్నట్టు చెబుతున్నారు. రామ్ చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ వరుస కొరటాల నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పట్ల అందరిలోను ఆసక్తి వుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu