HomeTelugu Trendingఆకథ కోసం 'సాహో' దర్శకుడిపై దృష్టిపెట్టిన చిరంజీవి!

ఆకథ కోసం ‘సాహో’ దర్శకుడిపై దృష్టిపెట్టిన చిరంజీవి!

6 4

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందేన. ఆలోచింపజేసే కథతో .. ఆసక్తిని రేకెత్తించే కథనంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి ‘లూసిఫెర్’ తెలుగు రీమేక్ ను పట్టాలెక్కించనున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా, 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

దాంతో తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ దక్కించుకున్నాడు. చిరంజీవి హీరోగా చరణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఈ నేపథ్యంలో వినాయక్. హరీశ్ శంకర్‌ ల పేర్లు వినిపించాయి. తాజాగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ పేరు తెరపైకి వచ్చింది. ‘సాహో’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రభాస్ ను సుజీత్ చాలా స్టైలిష్ గా చూపించాడు. భారీ సినిమానే అయినా బాగా డీల్ చేశాడు. అందువలన సుజీత్ పై చిరూ దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!