HomeTelugu Big Storiesవైరల్‌గా మారిన చిరు-విజయశాంతి

వైరల్‌గా మారిన చిరు-విజయశాంతి

4 5టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి చీఫ్‌గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్ర పోషించారు. ఈ వేడుకలో ఈ ఇద్దరు కలుసుకున్నారు. ఆ రోజల్లో చిరంజీవి, విజయశాంతి అంటే సూపర్‌ డూపర్‌ హిట్‌ పెయిర్. వాళ్లిద్దరూ కలిసి స్టెప్పేశారంటే… సిల్వర్‌ స్క్రీన్‌ చిత్తడైపోవాల్సిందే. ఆ తర్వాత చిన్న చిన్న మాటల విద్వేషాలతో.. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇక, పొలిటికల్ గ్రౌండ్‌లో ఎంట్రీ ఇవ్వగానే ఆ గ్యాప్ మరింత పెరిగింది. అయితే మహేష్‌ బాబు సినిమా పుణ్యమా అని వాళ్లిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు గుర్తుచేసుకుంటూనే ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

రాజకీయాల్లో చాలా అనుకుంటాం… స్నేహం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందంటూ చేతులు కలిపారు.”సండే అనకురా మండే అనకురా ఎప్పటికీ నీదాన్నిరా అంటూ మాట ఇచ్చి నా మనిషిగా నా హీరోయిన్ గా ఉండకుండా పదిహేనేళ్ల తర్వాత ఇప్పటికి కనిపించిందని చెప్పుకొచ్చారు చిరు. విజయశాంతితో ఓ హీరోయిన్‌గా కంటే ఎక్కువ అనుబంధం ఉండేదని, మద్రాస్‌లో తన ఇంటి ఎదురుగానే విజయశాంతి కూడా ఉండేదని కానీ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తనను విజయశాంతి విమర్శించిన తీరును పదేపదే ప్రస్తావించారాయన.

చిరు మాటలకు వెంటనే “చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో రఫ్పాడించేస్తా జాగ్రత్త” అంటూ నవ్వుతూనే అదేమీ లేదని చెప్పుకొచ్చారు విజయశాంతి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికీ మీరే నా హీరో, నేనే మీ హీరోయిన్ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు లేడీ సూపర్ స్టార్. మొత్తమ్మీద.. స్నేహితులు, ఆప్తుల మధ్య రాగద్వేషాలు కలకాలం ఉండవని తేలిపోయింది. రాజకీయాలు మనుషుల మధ్య శత్రుత్వాలను పెంచితే, సినిమా రంగం మాత్రమే స్నేహాన్ని పంచుతుందన్న మెగాస్టార్ వ్యాఖ్యలు నిజమై.. టాలివుడ్ మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్ కలిసి మరో సందేశాన్ని సినీ ప్రపంచానికి అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu