HomeTelugu Newsకరోనా ఎఫెక్ట్‌: మార్చి 31 వరుకు థియేటర్లు క్లోజ్‌

కరోనా ఎఫెక్ట్‌: మార్చి 31 వరుకు థియేటర్లు క్లోజ్‌

8 10
కేరళలో కరోనా వైరస్‌ కారణంగా.. రేపటి నుంచి సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. ఈ మేరకు మలయాళ సినిమా సంస్థలు మంగళవారం కొచ్చిలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి మొదలై మార్చి 31 వరకు థియేటర్ల మూసివేత కొనసాగుతుందని వారు తెలిపారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. కేరళలో తాజాగా ఆరు కరోనా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేరళలో వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 12కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను, పాఠశాలలను మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రజలు బహిరంగ సమావేశాలు, ఇతరత్రా బహిరంగ ఉత్సవాలకు మార్చి 31వరకు దూరంగా ఉండాలని సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu