నందమూరి బాలకృష్ణ నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’ కాగా బయోపిక్ మొదటి భాగం ‘కథానాయకుడు’ తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని ముగించుకుంది. సెన్సార్ బోర్డు సినిమాకు సింగిల్ కట్ కూడ చెప్పకుండా క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో విడుదలకు సర్వం సిద్దమైనట్లే. జనవరి 9వ తేదీన థియేటర్లోకి వస్తున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లోనేకాక, యావత్ తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యొక్క 2వ భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించాగా.. రానా, సుమంత్, కళ్యాణ్ రామ్, జగపతి బాబుతో పాటు తదితరలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.