HomeTelugu Big Storiesఈ సారి పవన్‌ కళ్యాణ్‌ మామిడి పండ్లు పంపించలేదు: అలీ

ఈ సారి పవన్‌ కళ్యాణ్‌ మామిడి పండ్లు పంపించలేదు: అలీ

4 1
టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్, హాస్య నటుడు అలీల కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరికి మధ్య ఉన్న స్నేహం గురించి అందరి తెలిసిందే. అయితే ఇద్దరూ రాజకీయ ప్రవేశం చేయడంతో గత ఎన్నికల సమయంలో పవన్, అలీల మధ్య కొన్ని విభేదాలు తలెత్తిన విషయం వచ్చాయి. కాగా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అలీ కొన్ని టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలో ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేసాడో.. కుటుంబంతో ఎలా గడిపాడో ఇలా పలు అంశాలపై చర్చించాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు దానిపై కూడా అలీ స్పందించాడు.

పవన్ గురించి మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ గారికి నేనంటే చాలా ఇష్టం. నా కామెడీ అన్నా, నా హావభావాలు అన్నా ఆయన ఎంతో ఇష్టపడతారు. దాదాపు ఆయన నటించిన అన్ని చిత్రాలలో నేను నటించాను. ఎప్పుడైనా చిరంజీవిగారి కోసం వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కళ్యాణ్‌గారు ఆప్యాయంగా పలకరించేవారు. అప్పటికి ఆయన సినిమాల్లోకి రాలేదు. మా ఇద్దరి మధ్య అనుబంధం ‘తొలిప్రేమ’ చిత్రం నుంచి బాగా బలపడిందని తెలిపాడు. ఇక ప్రతి సంవత్సరం అన్నయ్య చిరంజీవిగారు ఆవకాయ పచ్చడి పంపిస్తే… పవన్ కళ్యాణ్ గారు ఆర్గానిక్‌గా పండించిన మ్యాంగోస్‌ను పంపించేవారని.. అయితే ఈ సంవత్సరం కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండటంతో పండ్లను పంపలేదని పేర్కోన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu