HomeTelugu Big Storiesదేశంలోని పేదలకోసం కేంద్రం భారీ ప్యాకేజ్

దేశంలోని పేదలకోసం కేంద్రం భారీ ప్యాకేజ్

5 24
కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి. ఈమహమ్మారిని అరికట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోనూ లాక్‌డౌన్‌ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా విపత్తు నుంచి కోలుకునేందుకు కేంద్రం 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

వలస కార్మికులు, గ్రామీణ, పట్టణ పేదలను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీ రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా పేద కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా దృష్టిపెట్టినట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, పారా మెడికల్ సిబ్బంది, వైద్యులు, నర్సులు వీరందరికి రూ. 50 లక్షల బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పేదలకు అందించే ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 3 నెలల పాటు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం అందించనున్నట్లు తెలిపారు. వచ్చే 3 నెలల వరకు పేదలకు 5 కిలోల బియ్యం లేదా 5 కిలోల గోధుమలు, కిలో కంది పప్పును ఉచితంగా అందించబోతున్నట్టు ప్రకటించింది. అదే విధంగా రైతులకు నెలకు రూ. 2 వేల చొప్పున వారి అకౌంట్లలోకి డబ్బులు వేయబోతున్నట్టు ప్రకటించారు.

దేశంలోని 20 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మహిళా ఉజ్వల్ యోజన కింద నెలకు ఒకటి చొప్పున 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 20 లక్షల వైద్య బృందాలకు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్టు తెలిపారు. 60 ఏళ్ళు పైబడిన వితంతువులు, దివ్యాంగులకు అదనంగా వెయ్యి ఎక్స్ గ్రేషియా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu