HomeTelugu Trendingజ్యూరీ మెంబర్‌గా దీపికా పదుకోనే

జ్యూరీ మెంబర్‌గా దీపికా పదుకోనే

Deepika jury member 75th ca
బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకోనేకి అరుదైన గౌరవం దక్కింది. అందుకే ఆమె భర్త, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ‘వావ్‌’ అంటున్నారు. ఇక ఆమె అభిమానులైతే ‘మన దేశీ అమ్మాయి మనకు గర్వకారణంగా నిలిచింది’ అని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రశంసలు ఎందుకంటే.. ప్రతిష్ఠాత్మక కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో దీపికా పదుకోన్‌ జ్యూరీ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఫ్రెంచ్‌ నటుడు విన్సెంట్‌ లిండన్‌ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు జ్యూరీలో ఉంటారు.

ఈ 75వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు మే 10 నుంచి 28 వరకు జరగనున్నాయి. మొత్తం 21 చిత్రాలు చూసి, ఒక చిత్రాన్ని అవార్డుకి ఎంపిక చేస్తారు. మే 28న అవార్డు ప్రదానం జరుగుతుంది. కాగా ఫ్రాన్స్‌ దేశంలోని కాన్స్‌ నగరంలో జరిగే ఈ చిత్రోత్సవాల్లో 2010 నుంచి దీపికా పాల్గొంటున్నారు. రెడ్‌ కార్పెట్‌పై వీలైనంత ఆకర్షణీయంగా కనిపించి, మార్కులు కొట్టేశారు. ఇప్పుడు జ్యూరీ సభ్యురాలి హోదాలో వెళ్లనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu