బాలీవుడ్ నటి ఈషా గుప్తా ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆమెను ఫూల్ చేశారు కొందరు ఆకతాయిలు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈషా ట్విటర్లో ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. కాకపోతే ఫొటోలో ‘అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాసుంది. దాంతో నెటిజన్లు ఈషాపై విపరీతంగా కామెంట్లు గుప్పించారు. కాసేపటి తర్వాత ఈషా ఆ ఫొటోను తొలగించారు. ఆ తర్వాత తన అకౌంట్ హ్యాకైందని, తాను ఆ పోస్ట్ పెట్టలేదని పేర్కొన్నారు. కొద్దిసేపటికి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. తాను ఓ ఎయిర్ఫోర్స్ అధికారి కుమార్తెనని, ఏ రోజు ఏ పండుగను జరుపుకొంటారో బాగా తెలుసని దీటుగా సమాధానమిచ్చారు.