HomeTelugu Trendingనడుము టచ్‌ చేశాడని.. ఓ వ్యక్తి వేలు విరిచేశా

నడుము టచ్‌ చేశాడని.. ఓ వ్యక్తి వేలు విరిచేశా

3 27

నటి తాప్సీ ఓ వ్యక్తి కావాలనే తనని టచ్‌ చేశాడని అన్నారు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పేర్కొన్నారు. దక్షిణాది చిత్రాలతోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు ఈ భామ. తాజాగా ఆమె కరీనా కపూర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘వాట్‌ ఉమెన్స్‌ వాంట్‌ 2’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సమాజంలో కొందరు వ్యక్తుల నుంచి తాను ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందుల గురించి తాప్సీ తెలియజేశారు.

‘చిన్నప్పటి నుంచి గురునానక్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా కుటుంబసభ్యులతో కలిసి గురుద్వార్‌ వెళ్తేండే దాన్ని. గురుద్వార్‌ బయట కొన్ని స్టాళ్లలో భక్తుల కోసం భోజనాన్ని అందింస్తుంటారు. అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. ఓసారి క్యూ లైన్‌లో నిల్చున్నప్పుడు ఓ వ్యక్తి కావాలనే నా నడుము పట్టుకున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి చేయి పట్టుకుని వేలు విరిచేశాను. అక్కడి నుంచి బయటకు వచ్చేశాను.’ అని తాప్సీ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu