ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఆనంద్ ‘గం గం గణేశా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఉదయ్ భూమిశెట్టి దర్శకత్వం వహించారు.ఈ చెడు ప్రపంచంలో మంచిగా బతకాలి అనుకోవడం చెడు ఆలోచన అనే కొటేషన్ తో టీజర్ మొదలుపెట్టారు. టీజర్ చాలా సరదాగా ఉంది. అమ్మాయిలను టీజ్ చేస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ, కళ్ల వెంట నీరు రాకూడదు అంటూ ఆనంద్ చెప్పే డైలాగ్ బాగుంది. టీజర్ లో చాలా ఈజ్ తో కనిపించాడు.
సరదాగా సాగుతోంది అనుకునేలోపు, విలన్ ఎంట్రీ వచ్చింది. మధ్యలో హీరోయిన్ తో ఘాటు లిప్ లాక్ లు కూడా ఇచ్చాడు. టీజర్ మధ్యలో వినాయకుడి విగ్రహం కనపడుతోంది. మరి, వీరి కథ కు గణేషుడికి సంబంధం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. హై-లైఫ్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు అవకాశం ఉంది.