HomeTelugu Newsఇండియా... పాకిస్తాన్ బోర్డర్ లో గోపీచంద్‌ పోరాటాలు..!

ఇండియా… పాకిస్తాన్ బోర్డర్ లో గోపీచంద్‌ పోరాటాలు..!

13 9టాలీవుడ్‌లో విలన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత యజ్ఞం సినిమాతో హీరోగా మారిపోయారు. ఆ సినిమా హిట్ తరువాత వరుసగా హిట్స్ ఇస్తూ దూసుకుపోయిన గోపిచంద్.. గత కొంతకాలంగా హిట్ కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. మంచి సినిమాలు చేస్తున్నా.. హిట్ మాత్రం రావడం లేదు.

దీంతో హిట్ కోసం ఓ క్రేజీ కాంబినేషన్లో ట్రై చేస్తున్నాడు గోపీచంద్. తీరు దర్శకత్వంలో హైవోల్టేజ్ సినిమా ఒకటి తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ఇండియా… పాకిస్తాన్ బోర్డర్ లో ప్రారంభం అయింది. రాజస్థాన్ లోని జైసల్మేర్, న్యూఢిల్లీలలో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు 50 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా సినిమాను విడుదల చేస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu