HomeTelugu Trendingపూరీ, ఛార్మితో రామ్‌కు గొడవ!

పూరీ, ఛార్మితో రామ్‌కు గొడవ!

4 21
డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, నటి, నిర్మాత ఛార్మితో హీరో రామ్‌కు గొడవైందని, వాళ్ల మధ్య పరిస్థితులు బాగోలేవని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్‌ విదేశాలకు వెళ్లారని కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రామ్‌కు కేవలం సగం పారితోషికం మాత్రమే ఇచ్చారని.. మణిశర్మ, మిగిలిన చిత్ర బృందానికి కూడా ప్రామిస్‌ చేసినంత పారితోషికం ఇవ్వలేదని వదంతులు వచ్చాయి.

ఈ మేరకు ఓ మీడియా సంస్థ రాసిన వార్తను రామ్‌ చూశారు. ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ‘ఈ వార్త చూసి పడిపడి నవ్వుకున్నా. ఇలాంటి తప్పుడు వార్తలకు సాధారణంగా నేను స్పందించను. కానీ, ఈ వదంతు మాత్రం సూపర్‌. ‘బంగారం అండీ వీళ్లు..’ అంటూ పూరీ, ఛార్మిని ట్యాగ్‌ చేశారు.

ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా కోసం రామ్‌, పూరీ, ఛార్మి కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ నెల 18న విడుదలైన సినిమా విజయం సాధించింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లో రూ.48 కోట్లు రాబట్టినట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu