HomeTelugu Trendingచిరంజీవి ఓకే చెబితే ఎగిరి గంతేస్తాను: అనిల్‌ రావిపూడి

చిరంజీవి ఓకే చెబితే ఎగిరి గంతేస్తాను: అనిల్‌ రావిపూడి

8 7
అనిల్ రావిపూడి తాజాగా రూపొందించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ నెల 11వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిగారు రావడం నా అదృష్టం. నా గురించి ఆయన మాట్లాడిన నాలుగు మాటలు నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అలాగే ఆయనతో సినిమా చేయాలని నాకూ వుంది. ఆ అవకాశం సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను. చిరంజీవిగారు ఓకే చెబితే ఎగిరిగంతేస్తాను. మూడు నెలలలో మంచి కథను సిద్ధం చేస్తాను” అన్నాడు. ఆయన ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu