టాలీవుడ్లో దేవదాస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ సినిమా తరవాత వరుసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మాస్ మహా రాజా రవితేజ తో వరుసగా సినిమాలు చేసింది. ఆ తరువాత తెలుగులో అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది అయితే అక్కడ కూడా ఈ భామకు కలిసిరాలేదనే చెప్పాలి. దాంతో కొంత కాలం సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత ప్రేమలో పడటం అది కొద్దిరోజులకే బ్రేకప్ చెప్పుకోవడం మధ్యలో ఇలియానా లావు గా మారడం అంత చకచక జరిగిపోయింది. ఆ తరువాత మళ్ళీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటీ సన్నగా మెరుపుతీగ లా మరీనా అవకాశలు మాత్రం రావడం లేదు.’అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. దాంతో ఈ భామ వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఫిమేల్ డామినేషన్ ఉండే ఒక లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ కోసం ఇలియానాతో డిస్కషన్స్ జరుగుతున్నాయట.ఇప్పటికే సమంత, ప్రియమణి, కియారా లాంటి వారు వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.